VijayaKumar

Apr 17 2024, 20:22

వలిగొండ ఎస్బిఐ బ్యాంకులో నగదులో కొరత, పరారీలో క్యాషియర్ కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

VijayaKumar

Apr 17 2024, 20:16

గురుకుల విద్యార్థి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి: బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల గురుకుల పాఠశాలలో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని, ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని అన్నారు, మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్నారు.

VijayaKumar

Apr 17 2024, 20:02

గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి; కొడారి వెంకటేష్ ,పల్లగొర్ల మోది రాందేవ్


 భువనగిరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి చినలచ్చి ప్రశాంత్ కుటుంబానికి ఇరవై లక్షల ఎక్సగ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సీ ఎచ్ ప్రశాంత్(12) చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కంచనపల్లి నర్సింగ్ రావు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్, బి ఆర్ ఎస్ పట్టణ సహాయ కార్యదర్శి గుండెబోయిన సురేష్ ,బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండేబోయిన శంకర్, నాయకులు పోలేపాక సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 17 2024, 18:53

గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి:ఏఐఎస్ఎఫ్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత 14వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన లో ఆర్ సి ఓ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అడ్డ గూడూరు మండల కేంద్రము లో నిరసన*

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 14వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో బీబీనగర్ మండలం జిబ్లాక్ పెళ్లి గ్రామానికి చెందిన చిన్నచి ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన బాధాకరం 

మృతుని కుటుంబానికి ప్రభుత్వం 15 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు

ఈరోజు అడ్డ గూడూరు మండల కేంద్రము లో ప్రభుత్వ నికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో గురుకుల పాఠశాలల్లో ,సంక్షేమ హాస్టల్లల్లో, ఫుడ్ పాయిజన్,జరుగుతున్న నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈరోజు ఒక విద్యార్థి ప్రాణం పోయింది అని రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రజిని గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొందని ఆర్సిఓ పర్యవేక్షణ లోపంతో గురుకుల పాఠశాలల్లో నిరంతర ప్రక్రియగా ఫుడ్ పాయిజన్ జరుగుతుందని ఘటన కారణమైన ఆర్ సి ఓ నువ్వు వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం 

ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ మండల నాయకులు చెరుకు శివరాజ్ ,జిల్లా రాకేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్ మహారాజ్, చిప్పలపల్లి ధనుష్, సూరారం సోహిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 17 2024, 18:27

వలిగొండ మండల వ్యాప్తంగా వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో శ్రీ రామాలయంలో, మండలంలోని వివిధ గ్రామాలలో బుదవారం శ్రీ రామ నవమి పురస్కరించుకొని శ్రీ సీతా సమేత శ్రీ రామ చంద్ర మూర్తి తిరు కళ్యాణo అంగరంగ వైభవంగా భక్తుల కనువిందుగా వేదపండితులు శాస్త్రోక్తoగా నిర్వహింఛారు. వేసవి కాలం సందర్భముగా భక్తులకు చలువ పందిళ్లు వేసి, మంచినీటి సౌకర్యం కల్పించారు.వలిగొండలో శ్రీ రామాలయంలో నిర్వహించిన ఈ కళ్యాణంలో స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అదేవిధంగా సంగెం గ్రామంలోని శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి సన్నిధిలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ముసలయ్య దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఈ కళ్యాణానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమి నేటి సందీప్ రెడ్డి హాజరైనారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ రమేష్, వైస్ ఎంపీపీ బాసర ఉమా బాల నరసింహ, మాజీ సర్పంచ్ కీసర రామ్ రెడ్డి, కాసుల కృష్ణ, జక్కుల వెంకటేశం సంజీవరెడ్డి మల్లారెడ్డి వరికుప్పల మల్లేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సతిరెడ్డి, కంకల కిష్టయ్య,కుంభం విద్యా సాగర్ రెడ్డి, వెంకటపాపి రెడ్డి,శ్రీ రాం రెడ్డి, బొల్ల శ్రీనివాస్ దంపతులు,కుందారపు కొమురయ్య దంపతులు,పల్లెర్ల రాజు దంపతులు,కంకల కిష్టయ్య,బచు శ్రీనివాస్,చెరుకు శివయ్య,చిలుగురి సతిరెడ్డి, బతినిలింగయ్య,సహదేవ, ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు..

VijayaKumar

Apr 17 2024, 12:55

చికిత్స పొందుతూ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్ వయసు 12 సంవత్సరాలు మంగళవారం రాత్రి మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి కి చెందిన మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న కలుషిత ఆహారం వలన విద్యార్థులు అస్వస్థకు గురైనారు. మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్ ను 13వ తేదీ హైదరాబాద్ కి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు బాధ్యులుగా భువనగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ గురుకులాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

VijayaKumar

Apr 16 2024, 20:34

భువనగిరిలో స్వర్ణగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిసిపికి వినతిపత్రం అందజేసిన బీసీ విద్యార్థి సంఘం


భువనగిరి DCP రాజేష్ చంద్ర సార్ని ఆఫీసులో కలిసి పలు విషయాలపై వినతిపత్రం ఇచ్చిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ స్వర్ణగిరి బోనగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద ప్రజలు రోడ్డు కాస్ చేసేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నందున పోలీస్ పికెట్ ట్రాఫిక్ పోలీస్లను వీకెండ్ లో 20 నుండి 30 వేల భక్తులు రాకపోకలు ఉన్నందున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని ఎలక్షన్లో ఎక్కువలోనికి గురవుతున్న గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని జిల్లాలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని రాత్రి వేళల్లో గ్రామాలలో దోపిడీకి గురవుతున్నందున పోలీసులను పెట్టాలని పలు విషయాలపై మాట్లాడిన తనంతరం డీసీపీ సార్ స్పందిస్తూ తప్పకుండా బైపాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులను పెడతామని ఎలక్షన్ లోనికి గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాత్ ఏర్పాటు చేశామని దోపిడి దొంగలను పట్టుకుని ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తాం అన్నారు DCP గారికి ధన్యవాదాలు తెలిపిన బీసీ విద్యార్థి సంఘం *ఈ సమావేశంలో యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్ , బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి, బిజెపి నాయకులు సురేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన శంకర్,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 16 2024, 19:24

సొంతగూటికి చేరిన ఎంపీటీసీ సామ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ముద్దాపురం కు చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,  

వేములకొండ ఎంపిటిసి సామ రాం రెడ్డి అసంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరారు. మంగళవారం తిరిగి తన అనుచర గనంతో భారీ సంఖ్యలో భువనగిరిలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన సుమారుగా 200 మందితో భువనగిరి డాల్ఫిన్ హోటల్లో స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, జడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, పాశం సతి రెడ్డి, కేశిరెడ్డి నీరజారెడ్డి,పల్లెర్ల సుధాకర్, పులిపలుపుల రాములు, వెంకట్ రెడ్డి, సామ చంద్రారెడ్డి, సూదిని నర్సింహా, సామ వెంకట్ రెడ్డి

తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 16 2024, 19:01

నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ జి వాణిశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు, తల్లులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.

అంగన్వాడి టీచర్ సక్కుబాయి పిల్లలకు ఇంగ్లీషు ,తెలుగు అక్షరమాల, అంకెల పరిచయాలు, పాటలు పిల్లలతో చేయించి తల్లులకు చూపించడం జరిగినది. పిల్లలకు మూడు నెలకు ఒకసారి అసైన్మెంట్ కార్డులలో పిల్లలు చేసిన యాక్టివిటీస్ మీద స్టార్స్ గుర్తించి వారికి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నరసమ్మ, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 16 2024, 18:08

ఈనెల 19న భువనగిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు

 ఈనెల 19న సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి యండి. జహంగీర్ గారి నామినేషన్ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉన్న హక్కులను సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నదని ఈ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారికి చేసిన పనులు ఏమీ లేవని ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది ఏమీ లేదని అందుకనే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లను ఓడించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాయి ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి ఎండి జాహంగీర్ ని గెలిపించాలని కోరినారు. 19 నాటి రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి. నాగయ్య, రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు

ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్, టి. జ్యోతి, డిజి. నరసింహారావు, చుక్క రాములు, పాలడుగు భాస్కర్ , జాన్ వెస్లీ , టి. సాగర్ ,మల్లు లక్ష్మి , ఎండి అబ్బాస్, పి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని నర్సింహ తెలియజేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సభ్యులు మధ్యపురం బాల నర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్, ఎంఏ. రైహిమాన్ తదితరులు పాల్గొన్నారు.